మన్యంటీవీ ఏటూరునాగారం:
ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రంలోని పిఎంఆర్ సి కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏటూరునాగారం సబ్ విజనల్ పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏటూరునాగారం ఐటిడిఏ పివో హనుమంతు కె జండగే మరియు ఏటూరునాగారం ఏఎస్పి గౌస్ ఆలంతో కలిసి ప్రారంభించారు. తదనంతరం పీవో మాట్లాడుతూ ఏటూరునాగారం సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషమని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇది మూడో వైద్య శిబిరం అని ఇలాంటి ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమని పోలీస్ శాఖను అభినందించారు. ఆదివాసి గుత్తి కోయ ప్రజలు మిమీ గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగుడెం మండలలో 27 గుత్తి కోయ గుంపుల నుండి 900 మంది కి మందులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏరియా ఆస్పటల్ వైద్యులు, సిహెచ్ ఏటూరునాగారం వైద్యులు, అమ్మ ఆస్పటల్ వైద్యులు ,ఏటూరునాగారంలోని ఆర్.ఎం.పి అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా వైద్యులు మరియు ఏటూరునాగారం,మంగపేట మెడికల్ షాప్ అసోసియేషన్,ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్, స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, కన్నాయిగూడెం ఎస్సై పాయం మొగిలి, మంగపేట ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Post A Comment: