గుండాల మన్యం టీవీ: గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టగా డ్రైవర్ తీవ్రగాయాలైన సంఘటన శనివారం ఆళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని రాఘవాపురం పంచాయతీ ట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలకు నీరు పోసేందుకు గాను సీతానగరం గ్రామంలోనీ వ్యవసాయ బోరు నుండి ట్యంకులో నీరు నింపుకొని వస్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ కు పెను ప్రమాదం తప్పింది. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా కొత్తగూడెం తరలించారు.
Navigation
Post A Comment: