👉 సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఎంపీడీవో జి రేవతి,స్పెషలాఫీసర్ వరదారెడ్డి,ఎంపిపి సున్నం లలిత,జెడ్పిటిసి భారత లావణ్య మరియు మండల అధికారులకు,పంచాయతీ అధికారులకు,ప్రజా ప్రతినిధులకు,పత్రికా మిత్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సన్మాన కార్యక్రమానికి అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.వారు మాట్లాడుతూ జిల్లాలో 21 మండలాలు ఉండగా,ఉత్తమ మండలంగా అన్నపురెడ్డిపల్లి మండలం గుర్తింపు పొంది,గణతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రంన్ని పొందినందుకు తనకు సంతోషంగా ఉందని,అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉత్తమ మండలం అవార్డు వచ్చినందుకు,తనకు చెప్పుకోదగ్గ శుభ పరిణామమని కొనియాడారు.మండలంలో అన్ని అభివృద్ధి పథకాలలో రథసారథులా ముందుకు నడిపించిన ఎంపిపి సున్నం లలిత,ఎంపీడీవో జి రేవతి,స్పెషల్ ఆఫీసర్ వరదారెడ్డి,జెడ్పిటిసి భారత లావణ్యలను అభినందించి,శాలువాతో ఘనంగా సన్మానించారు.మండల అభివృద్ధికి సహకరించిన అన్ని గ్రామ పంచాయతీల అధికారులకు,ప్రజాప్రతినిధులకు,పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమానికి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు, పోలీస్ సిబ్బంది,మండల సిబ్బంది,అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు,ఉప సర్పంచులు, ఎంపీటీసీలు,పలువురు ప్రజా ప్రతినిధులు,పంచాయతీ కార్యదర్శులు,పంచాయతీల సిబ్బంది,పాత్రికేయ మిత్రులు,మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: