CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి తహశీల్దార్

Share it:

 


చండ్రుగొండ మన్యం టీవీ  ప్రతినిధి.


మండలంలో ఉన్న ఎస్సీ ఎస్టీ లు  గిరిజనులు ప్రభుత్వ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జి వీరభద్ర నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని సీతాయిగూడెం గ్రామంలో  పౌర హక్కుల దినోత్సవం సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహశీల్దార్ జి వీరభద్ర నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ బి రాజేష్ కుమార్. పాల్గొని గ్రామంలోని యువకులకు అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి యువతకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థినిలు విద్యలో రాణించాలని. సొసైటీలో జరిగే ప్రతి విషయాలను అవగాహన పెంపొందించుకోవాలని. నలుగురికి స్ఫూర్తిదాయకంగా మనం ఎదగాలని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని వీటిని ప్రతి ఒక్కరు  సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలుర వసతిగృహం సంక్షేమ అధికారి సిహెచ్ లక్ష్మణ్ రావు, గ్రామపంచాయతీ సర్పంచ్ కీసర శాంతమ్మ, ఉప సర్పంచ్ బొర్రా కేశవ్, గ్రామ పెద్దలు కేసరి భద్రయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: