మన్యం టీవీ, అశ్వాపురం :గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కరానికి నిర్వహించే ప్రజా పోరాటాలే స్వర్గీయ కొల్లు శ్రీనివాస్ రెడ్డి కీ నిజమైన నివాళులు అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య పేర్కొన్నారు. శనివారం ఉదయం మొండికుంట సిపిఐ కార్యాలయం శ్రీనివాస్ రెడ్డి విగ్రహం వద్ద సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ అధ్యక్షతన జరిగిన 6వ వర్ధంతి సభలో ముఖ్య అతిధి గా పాల్గొనిప్రసంగించారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, నియోజకవర్గం కార్యదర్శి సైరెడ్డి పుల్లారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్, దంతాల జగదీష్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, సీనియర్ తెరాస నాయకులు జాలే రామకృష్ణ రెడ్డి, మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్, కొల్లు ఆశ, గణేశుల అమ్మాజీ వివిధ రాజకీయ పార్టీ ల నాయకులు కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు.
Post A Comment: