మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట లో
కార్మిక కర్శిక ప్రజల హక్కుల పై కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం గా దాడి చేస్తుంది అని సి ఐ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రాజారావు అన్నారు.కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సి ఐ టి యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక పోరు జాతరా శనివారం దమ్మపేట కు చేరుకుంది.దమ్మపేట సెంటర్ లో కొప్పుల శ్రీను అధ్యక్ష తన సభ లో రాజారావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ధనికులకు తన విధానాలు తో మేలు చేస్తుంది అన్ని భారాలు పేదలపై మోపు తున్న రని అన్నారు.ఆశ అంగన్వాడీ గ్రామపంచాయతీ కార్మికుల కు కనీస వేతనం 21వేలరూ ఇవ్వాలని కార్మిక కర్షక చట్టాలు సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేశ్ అప్పారావు,పద్మ నరసింహారావు,పిట్టల అర్జున్, సూరమ్మ,శారద,భద్రం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: