మన్యంటీవీ,ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో జలగం ప్రసాద్ రావు పర్యటించి,మండలంలోని మూకమామిడి,ఎర్రప్పగుంపు,రంగాపురం,గడ్డంవారిగుంపు గిరిజన గ్రామాలకు చెందిన 25 మంది వ్యవసాయ గిరిజన రైతులకు ఆర్థిక సహాయంగా జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోరు మోటర్లను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గిరిజన రైతులు,తమకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన జలగం ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పంపిణీ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు,అశ్వారావుపేట నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ,నాయకులు,కార్యకర్తలు,అధికారులు,గ్రామ పెద్దలు,ప్రజలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: