తుడుం దెబ్బ
మన్యంటీవీ ఏటూరునాగారం:
ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రంలో తుడుందెబ్బ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య మాట్లాడుతూ
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఆదివాసీలు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు తమ హక్కుల సాధన కొరకు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు మారుతున్నారు కానీ ఆదివాసీల తలరాతలు మారడం లేదు. ఆదివాసీలు దీర్ఘకాలంగా ఎదుర్కుంటున్న పోడు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, కుల సంఘాలతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య,ములుగు జెడ్పి చైర్ పర్సన్ కుసుమ జగదీష్ హాజరవుతారని అన్నారు. ఈ సమావేశానికి ఆదివాసీ ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆదివాసి యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం తుడుందెబ్బ మండల అధ్యక్షులు కబ్బాక రామన్న ,తాడ్వాయి మండల అధ్యక్షులు ఊకె నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: