CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టీఆరెస్ పార్టీ లో 30 కుటుంబాలు చేరిక

Share it:

 


👉టీఆర్ఎస్ లో చేరిన సీతారాంపురం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్లు

👉వెంకట్రావుపేట నుండి20కుటుంబాలు చేరిక

మన్యం టీవీ,పినపాక : 

మన్యం టీవీ,పినపాక : తెలంగాణా ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో 

మండల పరిధిలోని సీతారాంపురం గ్రామ పంచాయితీ సర్పంచ్ నాలి మహేష్‌, ఉప సర్పంచ్‌ కారం లక్ష్మి, వార్డు మెంబర్లు కారం లక్ష్మయ్య, శరం శంకర్‌లతో పాటు 10 కుటుంబాలు  గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే విధంగా వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన దర్రాజు కృష్ణ నాయకత్వంలో 20కుటుంబాలు,సీతరంపురం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు,మొత్తం 30 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరాయి.  ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో వీరికి  ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బూర్గంపాడు మార్కెట్‌ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్‌ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి,టీఆర్ఎస్ పార్టీ సీనియర్‌ నాయకులు  బొలిశెట్టి నరసింహారావు, కొండేరు రాము,బత్తుల వెంకటరెడ్డి,  దాట్ల వాసుబాబు, ఎగ్గడి శ్రీరామ్‌, సర్పంచ్‌లు ఎంపీటీసీలు, పలువురు  నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: