మన్యం టీవీ, పినపాక:పినపాక మండలం తోగూడెం పంచాయతీ గోపాలరావుపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు చిర్ర రవి ప్రమాద వశాత్తు తాటిచెట్టుపై నుండి కింద జరిపడడం తో తీవ్ర గాయాలయ్యాయి.ఈ విషయాన్ని పినపాక మండల టీఆరెస్ పార్టీ అద్యక్షులు పగడాల సతీశ్ రెడ్డి,ఎంపీటీసీ ల సంఘం మండల అధ్యక్షులు ,తోగూడెం ఎంపీటీసీ డా.చింతపండు సత్యం లు విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు దృష్టికి తీసుకవేళ్ళారు.తక్షణమే స్పందించిన విప్ రేగా కాంతారావు చిర్ర రవి వైద్య ఖర్చులకు గాను రేగా విష్ణు చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా రూ.17వేల ఆర్ధిక వితరణ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ మణుగూరు డివిజన్ అధ్యక్షులు పొనుగోటి భద్రయ్య పిఎసిఎస్ చైర్మన్ రవి శేఖర వర్మ ,తోగూడెం ఉపసర్పంచ్ బుసి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాట్ల వాసు బాబు, కొండేరు రాము ,కామేష్ కొంపల్లి మల్లేష్ గౌడ్ ,ఊడుగుల రామచంద్రు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: