ములుగు ఎంఎల్సీ ఎన్నికల ఇంచార్జి పోరిక గోవిందనాయక్
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో ఈ రోజు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా తెరాస కార్యకర్తలు ముందుకు సాగాలని ములుగు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి పోరిక గోవిందనాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ రోజు మండల కేంద్రంలో కమలాపురం, మంగపేట గ్రామంలో ఉన్న పాఠశాలు కాలేజ్ లో తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశా నికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి పోరిక గోవిందనాయక్ మాట్లాడుతూ
ఎంతో మంది ప్రాణ త్యాగాలలో పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గౌ శ్రీ కేసీఆర్ గ తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్తు అందిస్తున్నారు అన్నారు
ములుగు జిల్లా సాధనలో తన వంతు పాత్ర పోషించి ములుగు జిల్లాను ప్రకటించిపజేసిన నిరా డంబరుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి
మొదటి ప్రాధాన్యత ఓటు తో అధిక మెజార్టీ తో గెలిపించి జిల్లాను ప్రకటింప చేసిన పల్లా గెలుపును బహుమతిగా గౌ శ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇవ్వాలి అని అన్నారు గోవిందనాయక్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ,మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ,మహిళా అధ్యక్షురాలు కాటూరి సుగుణ ,ఏటూరునాగారం పీఏసీ ఎస్ చైర్మన్ కూనారపు అశోక్ ,మంగపేట పీఏసీఎస్ వైఎస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, జిల్లా జీవ వైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, పీఏసీఎస్ డైరెక్టర్లు సిద్దంశెట్టి లక్ష్మన్ రావు, సింగరిబోయిన నర్సయ్య ,నర్రా శ్రీధర్, అచ్చ సత్యనారాయణ, తెరాస కే వీ జిల్లా కన్వీనర్ కుర్బన్ ఆలీ,జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి ,కునూరు మహేష్ ,బీసీ సెల్ మండల అధ్యక్షులు పసుపులేటి సుబ్బారావు ,కుంట ఏడుకొండలు , యూత్ మండల ప్రధాన కార్యదర్శి పున్నెం మోహన్ ,బాలకృష్ణ ,ఉడుగుల శ్రీనివాసు మండల మీడియా ఇంఛార్జి గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: