మన్యం టీవీ, పినపాక:తాటిచెట్టు పై నుండి పడి ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలైన సంఘటన తోగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు,బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగూడెం పంచాయతీ గోపాలరావు పేట గ్రామానికి చెందిన చిర్ర రవి గౌడ్ (మూగ వ్యక్తి)రోజు వారిలానే తోగూడెం గ్రామంలో తాటిచెట్టు ఎక్కాడు.చెట్టుకున్న తాటి మట్టలు చదును చేస్తున్న క్రమంలో కాలు జారీ తాటిచెట్టు పై నుండి క్రింద పడ్డాడు.ఈ క్రమంలో చిర్ర రవి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108 లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Post A Comment: