మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలంకు ఉత్తమ మండలంగా ప్రశంసా పత్రం వచ్చినందుకు,జడ్పిటిసి భారత లావణ్య రామ్ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ,అభివృద్ధిలో జిల్లాలోనే అగ్రగామిగా అన్నపురెడ్డిపల్లి మండలంను ఉంచుటకు అహర్నిశలు కృషిచేసిన ఎంపీడీవో జి రేవతి మరియు ఆఫీస్ సిబ్బందికి అభినందనలు తెలియజేసి,ఎంపీడీవో జి రేవతిను శాలువాతో సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో తోట్టిపంపు సర్పంచ్ సున్నం చిరంజీవి, టిఆర్ఎస్ నాయకులు జంగాల ఉమా,రుంజా లాలు,ఇటికల హరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: