మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం నుండి పినపాక మండలం లో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న నేపథ్యంలో రామానుజవరం వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ఒక వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి,మరో క్షతగాత్రుడు ని దగ్గరుండి 108 సమాచారం ఇచ్చారు, అనంతరం వారు 108 వాహనం వచ్చేంతవరకు అక్కడే ఉండి ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
Post A Comment: