CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విజయం సాధించిన క్రికెట్ జట్లకు బహుమతులు ప్రధానం

Share it:


 మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:అన్నపురెడ్డిపల్లి మండలం,పెంట్లం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ విజేత జట్లకు బహుమతులు ప్రధానం చేశారు.పెంట్లం గ్రామ క్రికెట్ క్రీడాకారులు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్(పెంట్లం క్రికెట్ ప్రీమియర్ లీగ్)ను,ఈ నెల 24 వ తేదీ నుండి ప్రారంభించారు.ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న జట్లు పెంట్లం లెవెన్ కింగ్స్,కేజియం లెవెన్ కింగ్స్,సాగర్ లెవెన్ కింగ్స్,భాస్కరపురం 11 కింగ్స్,రామబాణం,గల్లీబాయ్స్ నామవరం జట్లు పాల్గొనగా,మొదటి బహుమతి కప్పు మరియు 3016/-నగదును పెంట్లం లెవెన్ కింగ్స్ జట్టు కైవసం చేసుకొని,బహుమతి ప్రదాత అయిన సోయం రాంబాబు (రెవెన్యూ ఇన్స్పెక్టర్-లక్ష్మీదేవిపల్లి మండలం)చేతుల మీదుగా అందుకున్నారు.ద్వితీయ బహుమతి 2016/-నగదు మరియు షీల్డ్ ను గల్లీ బాయ్స్ నామవరం జుట్టు కైవసం చేసుకుని,బహుమతి ప్రదాత అయిన కంచు రామకృష్ణ చేతులు మీదుగా అందుకున్నారు.బెస్ట్ బ్యాట్స్ మెన్ బహుమతిని కుర్సం అర్జున్,మెన్ ఆఫ్ ది సిరీస్ బహుమతిని గుర్రం అర్జున్ సొంతం చేసుకున్నారు.ఈ క్రీడా కార్యక్రమంలో క్రీడాకారులు,పంచాయతీ సర్పంచ్ సవలం రాణి,ఎంపీటీసీ బోగ్గం సీత, పసుపులేటి కృష్ణ (పంచాయతీ కార్యదర్శి-ప్రశాంత్ నగర్),సోయం రమేష్(ఏఎస్ఐ),గ్రామ పెద్దలు సవలం ప్రకాష్,తేజావత్ వస్రాం,మడివి నాగేంద్రబాబు,బోయినపల్లి చందు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: