మన్యం టీవీ మంగపేట.
రాష్ట్ర ప్రభుత్వం72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగపేట తహసీల్దార్ బాబ్జిప్రసాద్ ములుగు జిల్లాలో ఉత్తమ తహశీల్దార్ గా ఎంపికచేశారు.ఈమేరకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ చేతుల మీదుగా మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డుల ప్రదానోత్సవంలో సదరు అవార్డ్ ను స్వీకరించారు. అదేవిధంగా మంగపేట మండల పంచాయితీ అధికారి శ్రీకాంత్ కూడా జిల్లాలో ఉత్తమ మండల పంచాయతీ అధికారిగా ఎన్నికయి జిల్లా అధికారి చేతుల మీద అవార్డు అందుకున్నారు. అటవీశాఖ రేంజ్ అధికారి షకీల్ పాషా జిల్లాలో ఉత్తమ అటవీశాఖ అధికారిగా ఎంపికై ఈమేరకు జిల్లా అటవీ అధికారి నుంచి అవార్డు ను అందుకున్నారు.అలాగే మండలంలోని పంచాయతీ రాజ్ ఏ.ఈ.ఈ వాసుదేవరెడ్డి కి జిల్లాల్లో ఉత్తమ అసిస్టెంట్ ఇంజనీర్ గా ఎంపికై ఆమేరకు జిల్లా ఎస్సీ నుంచి ఉత్తమ్ అవార్డు ను అందుకున్నారు. ఎన్. ఆర్.ఈ.జి.ఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సదయ్య సైతం జిల్లాలో ఉత్తమ టెక్నికల్ అసిస్టెంట్ గా ఎంపికై జిల్లా అధికారుల చేతుల మీద అవార్డు దక్కింది. అకినేపల్లి మల్లరం గ్రామపంచాయతీ కార్యదర్శి కోడెపాక శ్రావణ్ కుమార్ కు ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా ఎంపికై జిల్లా కేంద్రంలో డి.పి.ఓ వెంకటయ్య చేతుల మీద అవార్డు అందుకున్నారు.రాజుపేట వి.ఆర్.ఏ నర్సింహమూర్తి కూడా జిల్లాలో ఉత్తమ వి.ఆర్.ఏ గా ఎంపికై అవార్డు లభించింది. ఈసందర్భంగా వారిని పలువురు ఉద్యోగులు, నేతలు,ప్రజలు అభినందించారు.
Post A Comment: