మన్యంటివి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, గండుగులపల్లీలో
మన్యం మనుగడ మాసపత్రిక ఆధ్వర్యంలో రూపొందించబడిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం ఆవిష్కరించడం జరిగింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దమ్మపేట మండలం, గండుగులపల్లీ గ్రామంలో తన స్వగృహంలో మన్యం మనుగడ క్యాలెండర్ని మన్యంటీవీ ప్రతినిధులు జి మోహన్, దాది చంటి ల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మన్యం మనుగడ మాసపత్రిక మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే అంచెలంచెలుగా ఎదుగుతుందని అన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు వివరిస్తూ వెనుకబడిన వారి ముందంజలో తీసుకురావడానికి పత్రిక ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఎఎంసి వైస్ చైర్మన్ కోయిల అచ్యుతరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర రావు, జమిందార్ బంజారా సర్పంచ్ ప్రసాద్, మొండివర్రె సర్పంచ్ బాబాజీ, మనుబోలు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: