_నేడు మిర్చి రైతుల సమస్యల అధ్యయనం పై జిల్లాకు రానున్న రీసెర్చ్ సి .టి .ఎఫ్ .సి ప్రతినిధి ముకుంద్ కుమార్ చందన్_
_జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి_ ......
మన్యం టీవీ మంగపేట.
దేశంలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించే విధంగా, నివేదికను రూపొందించి, పథకాలు అమలయ్యేలా చూడాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి, జాతీయ సి.టీ.ఎఫ్. సి. రీసెర్చ్ ప్రతినిధి ముకుంద్ కుమార్ చందన్కి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు ఆయన హనుమకొండలోని సర్క్యూట్ అతిథిగృహంలో మిర్చి పంట పై సి.టి. ఎఫ్. సి. నివేదిక రూపొందించటంలో భాగంగా, మిర్చి సాగు సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఐదు రోజుల తెలంగాణ పర్యటనకి ఢిల్లీ నుండి వరంగల్ వచ్చిన సందర్భంగా ఆయనకు పూల బోకే అందజేసి సాంబశివరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తెలంగాణ పర్యటన, మిర్చి సమస్యల అధ్యయనంపై "స్పైసెస్ బోర్డు" డి. డి. డాక్టర్ జి. లింగప్పతో కలిసి ముకుంద్ కుమార్ చందన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాసిరెడ్డి. సాంబశివ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులలో దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కార మార్గాలను చూపే విధంగా పర్యటన కొనసాగాలని కోరారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మిర్చి ఎక్స్ పోర్టర్లను, ట్రేడర్స్, సీతల గిడ్డంగుల సందర్శన, వ్యవసాయ మార్కెట్ సందర్శన, గోదాముల సందర్శన ఉంటాయని దీనిలో భాగంగా బుధవారం క్షేత్రస్థాయిలో మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పర్యటిస్తారని సాంబశివ రెడ్డి తెలిపారు. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు ఆదేశాల మేరకు సి.టీ.ఎఫ్. సి. రీసెర్స్ ప్రతినిధి ముకుంద కుమార్ చందన్ మరియు స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాధి లింగప్ప బృందంతో కలిసి మిర్చి సాగు చేసే రైతులు, ఎఫ్. పి. ఓ .లను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారని సాంబశివ రెడ్డి తెలిపారు.
Post A Comment: