*ఎంపీపీ గుమ్మడి గాంధీ
మన్యం టీవి,పినపాక :
పినపాక మండలం ఏడూళ్లబయ్యారం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధి లోని బయ్యారం క్రాస్ రోడ్లో రెండు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ఆధార్ శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలని పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, భద్రాచలం సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్
వి.సుచిందర్లు కోరారు.
శుక్రవారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో గల రాధిక కాన్సెప్ట్ స్కూల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆధార్ కార్డు నమోదు, మరియు ఆధార్ కార్డు లోని చిరునామా, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ముఖ ఛాయా చిత్రం, మార్పు చేర్పులకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలో గల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏడూళ్లబయ్యారం సర్పంచ్ కోరం రజిని, పోస్ట్ల్ మెయిల్ ఓర్సిల్ దుర్గా ప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, గ్రామ పెద్దలు ఉడుముల లక్ష్మారెడ్డి, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: