మన్యం టీవీ: కరకగూడెం. కరకగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ రేగా కాళిక అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సుమారు 10 నెలలుగా కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడివున్నాయి కావున తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు 9,10 తరగతులు ఫిబ్రవరి 01 నుండి పాఠశాలలు ప్రారంభకానున్నాయి.ప్రధానోపాధ్యాయులు విధిగా అందరు ఉపాద్యాయులతో,సర్పంచులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులను ప్రారంభించడానికి సమాయత్తం కావాలని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక కోరారు. గ్రామాలలో ఉన్న పాఠశాలల ఆవరణ,తరగతి గదులలో పారిశుధ్య కార్యక్రమాలు చేసి హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేసి విద్యార్థులు,తల్లిదండ్రులలో ధైర్యాన్ని నింపె విధంగా గ్రామపంచాయితీలు పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేయాలని సర్పంచులను,కార్యదర్శులను సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్దులకు మాస్క్ వాడే విధంగా చూస్తూ టెంపరేచర్ చెక్ చేయటానికి ఒక ఆశా కార్యకర్తను పాఠశాలలో వుండే విధంగా చర్యలు చేపట్టాలని మెడికల్ ఆఫీసర్ గారి కోరారు.అన్ని డిపార్ట్మెంట్ ల వారి సహయసహకారాలతో ప్రశాత ఆరోగ్య కరమైన వాతావరణం లో తరగతులు నిర్వహించాలని అధికారులకు సూచనలు జారీ చేసారు.ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య,ఎంపీడీవో శ్రీను,మెడికల్ ఆఫీసర్ పర్ష్యానాయక్,ఎంపీఓ సునీల్,మండల నోడల్ ఆఫీసర్ ఫర్ స్కూల్స్ నాగేశ్వరరావు,ఎపీఎం త్రీగుణ,భట్టుపల్లి, చిరుమళ్ళ,కరకగూడెం,అనంతారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు,కార్యదర్శులు పాల్గొన్నారు.
Post A Comment: