మన్యం టివి,దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం,దమ్మపేటలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీ రామ మందిరం నిర్మాణం కొరకు ప్రతి ఒక హిందూ బంధువు ఈ కార్యక్రమంలో తమ వంతు సాయం అందించాలని ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరి చందాలతో ఈ శ్రీ రామ మందిరం నిర్మాణం జరగాలనే గొప్ప సంకల్పంలో భాగంగా ఈ రోజు దమ్మపేట మండల కేంద్రం లో మరియు మందలపల్లి గ్రామం నందు గ్రామ పెద్దలు యువకులు హిందూ బంధువులందరూ కలిసి సంయుక్తంగా శ్రీ రామ నినాదాలతో గ్రామం అంతా బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం తరువాత ప్రతి ఇంటికి ప్రతి గడపకు శ్రీ రామ మందిర ఆహ్వానం ఇవ్వాలని మండలంలోని హిందూ బంధువులందరూ నిర్వహించారు.ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ప్రతి ఒక్కరూ స్వచ్ఛoదంగా ముందుకు వచ్చి తమ వంతు సాయం శ్రీ రామ మందిరానికి విరాళాము ఇవ్వగలరని కోరుకుంటున్నాము.ఈ కార్యక్రమంలో మండల సభ్యులు కక్కిరాల రాజా,సింగంశెట్టి వెంకటేశ్వరావు ,ఆరేపల్లి సుబ్బారావు, గిద్దా కొండయ్య,దారవతు చెన్నకేశవరావు,చారుగుండ్ల ప్రదీప్,జుజ్జురి చెన్నారావు, ముక్కు మనోజ్ ,బవిరిశెట్టి ప్రసాద్ ఫణి,పిడుగురాళ్ల శ్రీను,కక్కిరాల శివ కృష్ణ, పసుమర్తి విరేశ్వరావు,దారా మల్లిఖార్జునరావు, దొడ్డ వినోద్,ప్రకాష్,రాము,సాయి,అడపా సాయి,మనో గుప్తా,కె.వినోద్,పందేటి సీతారాములు,ప్రభు,శేషుబాబు,మహేష్,శ్రీను,నాగేoద్రా, చల్లా శేఖర్,దారా శ్రీను,ప్రవీణ్,మాడ హరి ర్యాలీలో పాల్గొన్నారు.
Post A Comment: