CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోండి ధర్మం పాటించాలి.

Share it:

 


 ఉట్నూర్ మన్యం టీవీ : నార్నూర్ మండలం ఆదిలాబాద్ జిల్లాలో మనకపూర్ గ్రామంలో జంగో లింగో దీక్ష గురు కుంరం  భగవంత్ రావు మాట్లాడుతూ గోండు కోయలు అభివృద్ధి చెందాలంటే గోండి ధర్మాన్ని పాటించి తమ ఇంటిని జాతిని జాగృతి పరచాలి అని అన్నారు. ఒకప్పుడు గోండు రాజుల కోటలలో పాలన ఉండేది.అది నేడు కనుమరుగు అయింది.ఎందుకంటే నేడు మన జాతి సొంత నీతి నియమాలు పాటించక బజారులో దొరికే తిండిని తిని అనారోగ్యానికి గురై ఆసుపత్రికి పాలవుతున్నారు. కనుక జంగో లింగో దేవుళ్లను ఆశ్రయించి ఉన్నతిని కోరుకోవాలని అన్నారు.నాయకులు,ప్రభుత్వాల మీద ఆధారపడి జీవించారదు అనిఅన్నారు.జంగో లింగో ను కొలిస్తేతేనె జాతి మనుగడ ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో జంగో లింగో ఘన్ సంస్థాన్ అధ్యక్షులు ఆత్రం రఘునాథ్,పెంధోర్ ప్రభాకర్ న్యాయవాది, పుర్క బాపురావు, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి, మడవి రాజేశ్వర్ తెలంగాణ కళాకారులు,గ్రామ.పటేల్ దేవరి గ్రామస్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: