మన్యం టీవి:
హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శనతో అలరించి టీమిండియ విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్ హైదరాబాద్కు చేరుకున్నాడు. ఈ మేరకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. మంత్రి శాలువా కప్పి సిరాజ్ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా పర్యటన తనకు ఎంతో చిరస్మరణీయమైందన్నారు. ఆ టూర్ను ఎన్నటికీ మరిచిపోలేనని హైదరాబాదీ స్పీడ్స్టర్ సిరాజ్ తెలిపాడు. భారత్ విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందనన్నాడు.
Post A Comment: