మన్యంటీవీ:అశ్వారావుపేట: అశ్వారావుపేట పి ఎస్ ఆర్ (పొంగులేటి శ్రీనివాసరెడ్డి) ట్రస్ట్ ద్వారా అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ కి ఐదు వేల రూపాయలు నగదు విరాళంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తోకల హరీష్ గుప్తా కి ట్రస్టు నిర్వాహకులు పొంగులేటి అభిమాని జక్కుల రాంబాబు ( సూర్య విలేఖరి) అందజేయడం జరిగింది. ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ అశ్వారావుపేట ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, జర్నలిస్టులకు ఆపద వస్తే ప్రెస్ క్లబ్ ద్వారా సహాయ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటున్నారని, నిత్యం జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రెస్ క్లబ్ కు విరాళంగా ఐదు వేల రూపాయలు పి ఎస్ ఆర్ ట్రస్ట్ నుండి ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలని పి ఎస్ ఆర్ ట్రస్టు నిర్వాహకులు జక్కుల రాంబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: