మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం,నరసాపురం(రాజాపురం)గ్రామంలో,రాష్ట్ర ప్రభుత్వం,హరితహారం లో భాగంగా గ్రామాల్లోని కాలుష్యాన్ని నివారించడానికి మరియు పొద్దంతా కష్టించే రైతులు,యువకులు,మహిళలు,పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు,అంతరించిపోతున్న ప్రకృతి అందాలను గ్రామాల్లో నెలకొల్పేందుకు,ప్రతి గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పల్లె ప్రకృతి వనంలోని మొక్కలకు నీరు పెట్టేందుకు నూతనంగా వేసిన బోర్ను సర్పంచ్ నల్లమొతుల రాములు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ మండల కో ఆర్డినేటర్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి,పంచాయతీ కార్యదర్శి ఖాదర్ మియా,వార్డ్ నెంబర్ మారుతి రాఘవులు,శ్రీనివాస్ రెడ్డి,దుబ్బాక రాము,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: