చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:
మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను. శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ పులిరాజు. మండలం విస్తృతంగా పర్యటించి పనులను పరిశీలించారు. అందులో భాగంగా రైతు కల్లాలు హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణ హరితహారం నర్సరీ పనులను రోడ్ల వెంబడి పిచ్చి మొక్కల తొలగింపు గ్రామాల్లో శానిటేషన్ వర్క్ పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న శానిటైజర్ నిర్వహణను దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభం కానున్న పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలలో విద్యార్థులను అనుమతించాలని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ శానిటైజర్ తో శుభ్రం చేయాలని. ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే రైతులు తమ పొలాల్లో ఉపాధి హామీ పథకం కింద రైతు కల్లాలు నిర్మించుకోవాలని. సూచించారు. పల్లె ప్రకృతి వాహనాలను సిబ్బంది ఎప్పటికప్పుడు మొక్కల సంరక్షణ బాధ్యతాయుతంగా తీసుకొని వాటికి నిరంతరం నీళ్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీవో తోట తులసీరామ్, ఎంఈఓ సత్తెనపల్లి సత్యనారాయణ, ఏపీవో ప్రమీల, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: