మన్యం టీవీ: కరకగూడెం. ఇటీవలే అనారోగ్యంతో మరణించిన చిరుమళ్ళ గ్రామపంచాయతి పరిధిలో వట్టంవారి గుంపు గ్రామానికి చెందిన ఊకే సాయమ్మ కుటుంబానికి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయంగా రూ. 10, 000/- ల చెక్కును రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య,వైస్ ఎంపీపీ పటాన్ ఆయూబ్ ఖాన్,ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొమరం రాంబాబు,ఆత్మ కమిటి డైరక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వట్టం వెంకటేశ్వర్లు,యలిపెద్ది శ్రీనువాసు రెడ్డి,కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి,కొలగాని పాపయ్య,అజ్జు, పాల్గొన్నారు.
Navigation
Post A Comment: