మన్యంటీవీ,అశ్వారావుపేట: అశ్వారావుపేట లో తుమ్మా రాంబాబు ఇంటిదగ్గర సమావేశం ఏర్పాట్ చేసిన టిపిసిసి మహిళ కాంగ్రేస్ జనరల్ సెక్రటరి మరియు ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి మాట్లడుతూ ఢిల్లీ లో శాంతియుతంగా కిసాన్ కవాతు చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జ్ , బాష్పవాయువు గోళాలు ప్రయో గించటం ఫై తీవ్రంగా ఖండించారు. బీ.జె.పి.కేంద్ర ఫ్రభుత్వం నిరంకుశంగా, హిట్లర్ లాగ వ్యవరిస్తుందని, రైతులకు ట్రాక్టర్ ర్యాలీకి పోలీస్ లే అనుమతిచ్చి దాడి చేశారని, దేశంలోనే రైతులను రోడ్డు పాలు చేసిన చరిత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని, రైతులపై దాడి చేసిన బీ.జె.పి.కి పతనం తప్పదని సున్నం నాగమణి హెచ్చరించారు. వ్యవసాయ రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చెయ్యాలని సున్నం నాగమణి డిమాండు చేసారు. ఈ కార్యక్రమము లో తుమ్మా రాంబాబు జిల్లా ఓ.బీ.సి.ప్రెసిడెంట్, నడింపల్లి శివరామరాజు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: