CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమసమాజ నిర్మాణానికి పునాది రైతులే

Share it:

 


*సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్


ఏటూరునాగారం/ములుగు :


 సమస్త జగత్తుకు అన్నం పెడుతూ,రైతులు సమాజానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు,ఆదివారం ములుగు జిల్లా రామచద్రాపురం,ముద్దునూరు తండాలో యాసంగి వరి నాట్లు వేసిన తస్లీమా,రైతు కూలీలతో కలిసి మధ్యాహ్నం పూట అన్నం తిన్నారు,అనంతరం తస్లీమా మాట్లాడుతూ నేటితరం నాగరిక సమాజం వ్యవసాయం యొక్క విలువను మర్చిపోతున్నారని,రైతు వ్యవసాయానికి దూరం అయితే మానవ మనుగడే కనుమరుగవుతుందని అన్నారు, సమసమాజ నిర్మాణంలో రైతన్నల ప్రాముఖ్యత ఎంతో ఉందని,రైతు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని,వ్యవసాయ పనులలో రైతులకు యువతి,యువకులు సహకరించాలని తస్లీమా తెలిపారు,సమాజంలో మార్పు రావాలంటే యువతి,యువకులు తల్లిదండ్రులతో వ్యవసాయ పనులు చేస్తూ వారికి సహకరించాల్సిన భాధ్యత మనందరిపై ఉందని తస్లీమా అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: