CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉సహనాన్ని పరీక్షిస్తే ..సహించేది లేదు.. రేగా

Share it:


* ఆళ్లపల్లి పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారుల కందకాలు

* అడ్డుకున్న రైతులు, ఎంపీపీ

గుండాల మన్యం టీవీ:  పోడు భూముల జోలికి వెళ్లొద్దని, పోడు సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాంతారావు కృషి చేస్తున్నారని పలు దఫాలుగా ఫారెస్ట్ అధికారులకు చెప్పినప్పటికీ కొంతమంది ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహంతో పోడు భూముల్లో కందకాలు చదువుతున్నారని ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామపంచాయతీ  పరిధిలోని సర్వే నెంబర్. 212లో 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో ఆదివారం కాచనపల్లి రేంజ్ ఫారెస్ట్ అధికారులు ఆదివారం కందకాలు చేస్తున్నారని రైతుల సమాచారంతో ఆళ్లపల్లి  ఎంపీపీ సంఘటన చేరుకొని పోడు భూముల్లో తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ విషయమై పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పందించారు.  పోడు భూములు లాక్కునే ప్రయత్నం మానుకోవాలని, సమస్య పరిష్కారం  అయ్యేవరకు పోడు భూముల్లో అడుగు కూడా పెట్టరాదని ఇటీవల హెచ్చరించినప్పటికీ అనంతోగు  పోడు భూముల్లో కందకాలు తవ్వడానికి వెళ్లి మా సహనాన్ని  పరీక్షిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పోడు సమస్యను సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లామని పొడు భూముల సమస్య పరిష్కారం అయ్యే వరకూ వేచి ఉండాలని ఈ విషయాన్ని ఫారెస్ట్ ఉన్నతాధికారులకు తెలిపామన్నారు. ఫారెస్ట్ అధికారులు కొంత సమయం ఓపిక పట్టాలని చెప్పిన కొంతమంది ఫారెస్ట్ అధికారులు పోడు భూముల్లో కందకాలు తవ్వుతూ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి ఇ సంఘటనలు పునరావృతమైతే పోడుదారుల పక్షాన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో సహకరించాలని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: