మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని
పగిడేరు గ్రామ పంచాయితీ గోళ్ళకొత్తూరు గ్రామానికి చెందిన మంచాల యాకయ్య యాదవ్ కుమారుడు సందీప్ యాదవ్ ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది.వీరి కుటుంబం ఆర్ధిక ఇంబంధుల్లో ఉన్నది అని తెలుసుకున్న మణుగూరు మండల యాదవ సంఘం సభ్యులు వారి కుటుంబానికి రూ.5000 రూపాయలు మరియు 1 క్వింటా బియ్యం అందచెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో మేకల ఆదిలింగయ్య యాదవ్, మార్తి శ్రీనివాస్ యాదవ్, పినపాక నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ మట్టపల్లి సాగర్ యాదవ్, సాయిల సురేష్ యాదవ్ సింగరేణి ఐటి మేనేజర్,గంట గోవర్ధన్ యాదవ్,మేకల గోపి యాదవ్,మంగి మల్లికార్జున్ యాదవ్,సాంబాయిగూడెం గ్రామ పెద్దలు పులిగిళ్ళ రమేష్ యాదవ్,రసాల రమేష్ యాదవ్, రామనుంజవారం గ్రామ పెద్దలు నోముల రవి యాదవ్,గొల్ల కొత్తూరు గ్రామ పేదలు మంచాల నాగమల్లు యాదవ్,పులిగిళ్ళ వెంకన్న యాదవ్,కావాటి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: