మన్యం టీవీ, బూర్గంపాడు:
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపు లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకు మద్దతు తెలుపుతూ బూర్గంపాడు మండల సారపాక పట్టణంలోని ప్రధాన కూడలిలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పక్కనపెట్టి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ రైతు హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మువ్వ వెంకటేశ్వరరావు, ఐటిసి ఏఐటియుసి అధ్యక్షులు ఎండి సాజిద్, సిపిఐ నాయకులు జహూర్, మాజీ వార్డు మెంబర్ గూగుల్ బీమా,ఫరీద్ సుల్తాన్, ఇమ్రాన్ పాష, తిరుపతిరావు, త్రిమూర్తులు, ముత్తారావు, బాబా, జలీల్, రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: