గుండాల మన్యం టీవీ: పోడు సమస్యను సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఆళ్ళపల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, జెడ్పిటిసి కొమరం హనుమంత రావు అన్నారు. గురువారం కాచన పల్లి అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్డిఓ అనిల్ కుమార్ తో అనంతోగు, రాయపాడు, మైలారం, జిన్నెల గూడెం పోడు రైతుల తో సమావేశం అయ్యారు. పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వడంతో తమకున్న కొంచెం జీవనాధారం కూడా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుండాల , ఆళ్లపల్లి మండలాలు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది వ్యక్తులు వందల ఎకరాలు అటవిని నాశనం చేసి స్థానిక రైతులకు కవులకు ఇస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాచనల్లి రేంజర్ మురళి, ఫారెస్ట్ సిబ్బంది, పోడు రైతులు పాల్గొన్నారు
Post A Comment: