మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచన్ ఆదివారం హైదరాబాద్లో సందడి చేశారు. నగరంలో జరిగిన ఓ వేడుకకు ఐశ్వర్య హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఐశ్ భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యతో కలిసి రావడం విశేషం.
ఇదిలా ఉంటే అమితాబ్తో పాటు ఐశ్వర్య, అభిషేక్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దీంతో గత పది నెలలుగా ఐశ్వర్య బయటకు వచ్చింది లేదు. ముంబైలోనూ ఈ తార గడిచిన 10 నెల్లలో ఒక్కసారికూడా మీడియాకు కనిపించలేదు. ఈ నేపథ్యంలో నగరానికి కుటుంబసమేతంగా వచ్చిన ఐశ్వర్య ఎయిర్ పోర్టులో మీడియా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
Post A Comment: