మన్యంటీవీ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, గోపాలపురం గ్రామం లో యూత్ ఆధ్వర్యంలో 2 రోజులు వాలీబాల్ ఆటల పోటీలను నిర్వహించకోగా మొదటి రోజు ముఖ్య అతిధి గా విచ్చేసిన దమ్మపేట జడ్పీటిసి పైడి వెంకటేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ఆటలను ప్రారంభించడం జరిగింది. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అశ్వారావు పేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, స్థానిక సర్పంచ్ పాశం సుగుణ, దమ్మపేట సర్పంచ్ చిన్న వెంకటేశ్వరరావు, వైస్ సర్పంచ్ దారా యుగేందర్, మన్నెం అప్పారావు, ఏసుబాబు, పాకనాటి శ్రీను, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: