ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు తోకల రవి.
మన్యంటీవీఏటూరునాగారం:
ఏటూరునాగారం మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిధిలావస్థకు చేరిన పాత భవనంలోని గదులను విద్యార్థులకు కేటాయించి, నూతనంగా నిర్మించిన కొత్త భవనంలోని గదులను యం.ఇ.ఓ కార్యాలయంకు కేటాయించి ఉపాధ్యాయులు వాడుకోవడం చాల దారుణం అని ఎస్.ఎఫ్.ఐ ములుగు జిల్లా అధ్యక్షులు తోకల రవి అన్నారు.ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుండి తొమ్మిది, పది తరగతులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గురువారం పాఠశాల సందర్శించిన ఆయన తరగతి గదుల ఏర్పాటు చేసిన విధానంను చూసి విస్మయం వ్యక్తం చేశారు.ఉపాధ్యాయులు తమ భద్రతను చూసుకొని విద్యార్థుల భద్రతను గాలికి వదిలెయ్యడం చాలా దారుణం అన్నారు. విద్యార్థుల కొరకు నిర్మించిన గదులను ఉపాధ్యాయులు వాడుకోవడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు.విద్యార్థుల ఎలాంటి ప్రమాదం జరిగిన మండల, జిల్లా విద్యాధికారులు బాధ్యత వహించాలి అన్నారు. విద్యాశాఖ అధికారులు మరియు పాఠశాల యాజమాన్య కమిటీ ఈ అంశం పైన వెంటనే స్పందించి విద్యార్థులకు నూతన భవనంలోని గదులను తరగతి గదులకు కేటాయించాలి అన్నారు. లేకపోతే విద్యార్థులకు న్యాయం జరిగేవరకు మా సంఘం తరుపున పోరాడుతాం అన్నారు. ఈ కార్యక్రంలో వీర్రాజు, యశ్వంత్, దుర్గా ప్రసాద్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: