మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గిరిజన సహకార సంఘం వారు,భారత్ పెట్రోల్ బంక్ ప్రారంభించారు.గిరిజన సహకార సంఘం తరఫున భారత్ పెట్రోల్ బంక్ ప్రారంభించడం వలన గిరిజన యువకులకు ఉపాధి లభించడమే కాకుండా,ద్విచక్ర వాహనదారులు మరియు ట్రాక్టర్ యజమానులు,ఇతర వాహనదారులు పెట్రోల్,డీజిల్ కోసం 20,25 కిలోమీటర్లు దూర ప్రయాణం చేయాల్సిన అవస్థ తప్పిందని,నూతన భారత్ పెట్రోల్ బంక్ మండల ప్రజలకు అందుబాటులో నిర్మించడం సంతోషించదగిన విషయమని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: