మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం,ఎర్రగుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద (కోవిడ్-19) డ్రై రన్ కార్యక్రమంను డీఎస్ఓ డాక్టర్ చేతన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.డ్రై రన్ కార్యక్రమంలో 25 మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులకు(ఆశా కార్యకర్తలు) ట్రైల్ లో భాగంగా కరోనా వ్యాధి బారిన పడిన వ్యక్తులకు చేయవలసిన నిర్ధారణ పరీక్షలు చేసి,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక టీకాలు వేయడం జరిగింది.మండల స్పెషల్ ఆఫీసర్,మండల టాస్క్ఫోర్స్ టీం తహసిల్దార్,ఎంపీవోలు కార్యక్రమంలో జరిగిన ఈ ప్రక్రియ మొత్తం పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: