మన్యం టీవీ మంగపేట.
పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ, ఆన్లైన్ చేయించాలని, రైతు బంధు ఇప్పించాలని, ఏటూరునాగారంను రెవిన్యూ డివిజన్ చెయ్యాలని కొమరం భీం స్టేడియం ఏటూరునాగారంలో 29/1/2021 న భహిరంగ సభ జరుగుతుంది అని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ములుగు నియోజకవర్గం ఎంఎల్ఏ ధనసరి అనసూయ, భద్రాచలం నియోజకవర్గం ఎంఎల్ఏ పొదెం వీరయ్య హాజరవుతారని ఈ సందర్బంగా శ్రవణ్ కుమార్ తెలిపారు.ఇట్టి సమావేశానికి ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు, కణితి వెంకటకృష్ణ, మడకం చిట్టి బాబు, కుబ్బింటి చిరంజీవి, మట్టి రమేష్ పాల్గొన్నారు.
Post A Comment: