జెసి దివాకర్ రెడ్డి జోస్యం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీద మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిష్టూరం ఆడారు. అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఇంకా చంద్రబాబు అదే వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఏదైనా సూటిగా సుత్తిలేకుండా డైరెక్టుగా చెప్పకుండా గంటల తరబడి సాగదీయడం చంద్రబాబుకు అలవాటని, అది మార్చుకుంటేనే టీడీపీ బాగు పడుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే అధికారులతో సమీక్షలు, చర్చల పేరుతో సమయం వృధా చేసేవారని జేసీ అన్నారు. ఇప్పటికీ ఆ పద్ధతి మారలేదన్నారు. పది నిమిషాల్లో ముగించే ప్రసంగాన్ని వంద నిమిషాలు చేస్తున్నారని, ఇలా టైమ్ వేస్తున్నారని మండిపడ్డారు. తనను కలిసేందుకు ఎవరైనా వస్తే వారి యోగక్షేమాలు, కుటుంబం బాగోగుల గురించి చంద్రబాబు ఏ రోజూ అడగలేదని జేసీ అన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి వాళ్లను ఎవరైనా కలవడానికి వెళితే వారు భుజంపై చెయ్యేసి కుటుంబం వివరాలు, యోగక్షేమాలు, ఆరోగ్యం బాగోగులు అన్ని తెలుసుకుని ఆ తర్వాత ఏ పని మీద వచ్చారనే విషయాన్ని అడిగేవారని జేసీ అన్నారు. అలాంటి అలవాటు చంద్రబాబు వద్ద అసలు తాను ఎప్పుడూ చూడలేదని జేసీ నిష్టూరమాడారు. ఎవరైనా వస్తే ఆయనకు నచ్చితే పలకరిస్తారని, నచ్చకపోతే వెళ్లిపోతారని ఆరోపించారు.
...
Post A Comment: