మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు మాట్లాడుతూ దళిత సంఘాలు, దళిత సోదర, సోదరి మణులు, దళిత బిడ్డలు అప్రమత్తం కావాలి ఆదమరిచి ఉంటే దళితుల ఉనికి లేకుండా చేయడానికి కొన్ని మత తత్వపార్టీలు దళితుల మీద లేని ప్రేమను ఒలక పోస్తున్నాయి. దేశ వ్యాప్తంగా దళితుల మీద ప్రతి రోజు ఎన్నో అరాచక అకృత్యాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే వాటిని ఆపకుండా, అటువంటి అరాచకాలు ప్రోత్సహించిన మత తత్వపార్టీలు మళ్ళీ మన దళితులను దగ్గర తీసుకొని నీతులు చెప్పి అరచేతిలోస్వర్గం చూపిస్తాం అంటుంటే అటువంటి పార్టీలకు అండగా నిలవొద్దు, మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ మనకు అంట గట్టడానికి జరిగే ఈ కపట ప్రేమకు తల వంచొద్దు. మన జాతి యావత్తు వేల, వందల సంవత్సరాలనుండి మనువాదులకు ఊడిగం చేసింది, అటువంటి బానిస బ్రతుకులసంకెళ్లు తెంచుకొని డెబ్భై నాలుగు సంవత్సరాలయినా కూడా మన జాతిని ఆర్ధిక, సామజిక, రాజకీయ,రంగాలలో ఎదగనీయకుండా మనువాదులు, మత తత్వ పార్టీలు కల్లాబొల్లి కబుర్లు చెప్పి మన పంచన చేరి మన కండ్లు పొడవటానికి, రాబందుల్లా ఎదురు చూస్తున్నారు అటువంటి ప్రలోభాలకు లోను కావొద్దని ఈ సందర్బంగా ములుగు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు దళిత ప్రజలకు తెలియజేసారు.
Post A Comment: