మన్యం టీవి, పినపాక:పినపాక మండలం లోని ఎల్చిరెడ్డిపల్లి పంచాయతీ లో కోలువైన శ్రీ హేమచల లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలోని సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం లక్ష్మి నరసింహ స్వామి వారి విగ్రహానికి పంచమృతాలతో అభిషేకం నిర్వహించారు.అనంతరం స్వామి వారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని వారి మొక్కులను తీర్చుకున్నారు. అలాగే స్వామి వారిని ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటి అధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అర్చకులు మర్ల రాంబాబు, భక్తులుఅధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: