నిర్మల్ గాంధీ పార్క్ కూరగాయల మార్కెట్ ను బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.. కూరగాయల వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు రోడ్డు అసౌకర్యం కు త్వరలోనే సమస్య పరిష్కారిస్తామని అన్నారు. హోల్ సెల్ వ్యాపారులకు పట్టణం లో అనువైన ప్రదేశం కేటాయిస్తామని నిర్మల్ పట్టణం బైల్ బజార్ వద్ద, న్యూ బస్ స్టాండ్ వద్ద బస్ డిపో, ఈదిగం వద్ద చిన్న తరహా కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తామని తద్వారా అటు వైపుగా వచ్చే రైతులకు దూర భారం తగ్గుతదని తెలిపారు. త్వరలోనే నిర్మల్ పట్టణం బస్ స్టాండ్ వద్ద గజ్వేల్, సిద్దేపేట తరహా సమీకృత మార్కెట్ ను నిర్మిస్తామని అన్నారు..అనంతరం చైన్ గేట్ వరకు రోడ్డును పరీశీలించారు.మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, విప్ నేరేళ్ల వేణు, కౌన్సిలర్లు రాజేందర్, చౌస్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: