మన్యంటీవీ ఏటూరునాగారం:
ములుగు జిల్లా కేంద్రంలోని ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, పతాకన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మరియు ఏఎస్పీ సాయి చైతన్య, ఆర్ డి ఓ రమాదేవి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పిటిసి సకినాల భవాని ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ జడ్పీ కో ఆప్షన్ నెంబర్ రియాజ్ మిర్జా, రైతుబంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, ఆత్మ చైర్మన్ బైకని ఓదేలు, దళిత సేవ సమితి జిల్లా అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అలం రామ్మూర్తి, జిల్లా సీనియర్ నాయకులు గోవింద నాయక్, మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్ పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సీతక్క పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానోత్ రవిచందర్, ములుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, ఎంపిటిసి మావురుపు తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: