మన్యంటీవీ ఏటూరునాగారం:
ఏటూరునాగారం మండల వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయంలో పివో హనుమంతు కే జండగే, ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ గౌస్ ఆలం, ఎంపీడీవో ఆఫీసులో ఎంపీడీవో శ్రీనివాస్, తాసిల్దార్ ఆఫీస్ లో తాసిల్దార్ రవీందర్, ఏటూరునాగారం మండల కేంద్రంలోని వివిధ స్కూల్స్, హాస్టల్ నందు ప్రిన్సిపాల్స్,హెడ్ మాస్టర్స్,ఏటూరునాగారం గ్రామపంచాయతీలో సర్పంచ్ ఈసం రామ్మూర్తి వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచులు పతాక ఆవిష్కరణ గావించారు. అలాగే ఐటీడిఏ లో జరిగిన పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డిటిడిఓ మంకిడి ఎర్రయ్య, ఏవో దామోదర స్వామి, మేనేజర్ లాల్, ఏసీఎం సారయ్య దొర, పెసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఐటీడీఏ లోని వివిధ సెక్టారులా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: