మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుగ్గ గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లకు శనివారం తహసీల్దార్ లూధర్ విల్సన్,బుగ్గ సర్పంచ్ తాటి రామకృష్ణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.సుమారు రూ.3కోట్ల రూపాయాలతో 60 డబల్ బెడ్రూమ్ లకు లబ్ధిదారులను ఎంపికచేశారు.విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు జడ్పీటీసీ పొశం నర్సింహారావు డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు,తహసీల్దార్ లూధర్ విల్సన్,ఎంపీడీఓ పి.వెంకటేశ్వర్లు,సర్పంచ్ తాటి రామకృష్ణ,విఆర్వో, ఐటీడీఏ ఏఈ,మరియు వార్డ్ మెంబర్స్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: