CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మార్చి 31 వరకు ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలి

Share it:

 



   *ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రెటరీ స్మితాసభర్వాల్                                                       

మన్యం టీవీ ఏటూర్ నాగారం:

 

 తుపాకుల గూడెం సమ్మక్క బ్యారేజి నిర్మాణం పనులు మార్చి 31 వరకు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రెటరీ స్మిత సభర్వాల్  ఆదేశించారు. ఆదివారం మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతం ములుగు జిల్లా కన్నాయిగుడెం మండలం లోని తుపాకుల గూడెంలో నిర్మాణంలో ఉన్న తుపాకుల బ్యారేజి, మరియు సమ్మక్క బ్యారేజి పనులను రాష్ట్ర  ప్రధాన  కార్యదర్శి  మరియు ఇరిగేషన్ సిఏడి డా. రజత్ కుమార్ , ఐఏఎస్ , మరియు ముఖ్యమంత్రి కార్యాలయం  సెక్రెటరీ శ్రీమతి స్మిత సభర్వాల్  పనుల పర్యవేక్షించారు. ముందుగా హెలికాప్టర్ లో ప్రాజెక్టు నిర్మాణం పనులను ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణా ఆదిత్య ,  ఐటిడిఏ పి.ఓ హనంతు కె జండగే  వారికి పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు.జిల్లా యంత్రాంగంతో కలిసి వారు తుపాకుల గూడెం బ్యారేజి పనులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా..శ్రీమతి స్మిత సభర్వాల్  మాట్లాడుతూ  ప్రాజెక్ట్ పనులు 31 మార్చి వరకు పూర్తి చేయాలని సంబంధిత చీప్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ ని ఆదేశించారు. ప్రాజెక్ట్ పనులు 24 గంటలు పని చేసి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ స్మిత సభర్వాల్ పర్యటన ఉండడంతో గ్రామీణ ప్రాంత అడవులను పోలీసులు అణువణువు జల్లెడ పడుతూ బందోబస్తు ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్ మరియు కన్నాయిగుడెం ఎస్సై పాయం మొగిలి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీర్ చీఫ్ (జనరల్) మురళీధర్ రావు, ఇంజనీర్  చీప్ (దేవాదుల) బి.నాగేందర్ రావు, ఎస్ ఇ ములుగు సుధీర్,వెంకటేష్,ఇ ఇ.జగదీష్, స్వామి ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: