మన్యంటీవీ,అశ్వారావుపేట:మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం నందు భద్రాద్రి జిల్లా ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొర్సా రాజేష్ అధ్యక్షతన ఎంపీడీవో కి ఏజెన్సీలో జీవో నెంబర్ 3 అమలుచేయాలని, 100% ప్రమోషన్లు ఆదివాసీలకే ఇవ్వాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం కొర్సా రాజేష్ మాట్లాడుతూ జీవో నెంబర్ 3 పటిష్టంగా అమలు చేయాలని, దానికి అనుగుణంగా 26 డిపార్ట్మెంట్లో 100% ప్రమోషన్లు ఆదివాసీలకే ఇవ్వాలని అన్నారు. పిఆర్సి 40% ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా అన్ని పాఠశాలలో స్కావెంజర్ లన్ నియమించాలని అన్నారు. అదేవిధంగా స్కూల్ గ్రాంట్స్ విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పూనెం వెంకటేశ్వర్లు, మండల నాయకులు కొర్సా రాజేష్, పద్మం రాము, తాటి శ్రీనివాస్, ఈసాల సీతారాములు, సున్నం ప్రసాద్, సోడే సుజాత, కుంజా కృపావతి, కట్రం రాజేశ్వరి, ఈసం రాజేష్, కుంజా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: