మన్యం టీవీ మంగపేట.
టిడిపి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం టిడిపి శ్రేణులు నిర్వహించారు .ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అతను చేసిన సేవలను కొనియాడారు. తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా పేరు ప్రఖ్యాతలు సాధించడన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెక్కల వేణుగోపాల్ నాయుడు, టియెన్ టియూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ భవనం శ్రీనివాస్ రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నందిగాం కృష్ణారావు, టిడిపి మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కాండ్రు సంయుక్త, టిడిపి సీనియర్ నాయకులు గుంటూరు ఉదయ భాస్కర్, కోరుకోప్పుల శంకర్ గౌడ్, అనంతుల శ్రీనివాస్ గుప్తా, తునికి వీర రాఘవ చారి, నల్లూరి పేరయ్య, కంచర్ల రాంబాబు, కొడాలి రఘు, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: