CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు మండల ఆరోగ్య కేంద్రం లో కోవిడ్ - 19 వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్...

Share it:


మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ - 19 వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ప్రారంభించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వీరబాబు తొలి కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఎవరు అపోహలను అసత్య ప్రచారాలను నమ్మొద్దు అన్నారు. ఈరోజు 30 మందికి వ్యాక్సిన్ ను ఇస్తున్నట్లు తెలిపారు. మరల 30 రోజుల తర్వాత రెండవ డోసు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ముందుగా ఈ వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకట్ రెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, మండల తహశీల్దార్ పి ఎల్ ఎన్ ప్రసాద్, ఎంపీడీవో రామారావు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: